August 2026






పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పణ

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లెల శివ నాగేశ్వరరావు, నరసరావుపేట బీజేపీ నాయకులు శ్రీ సంపత్ కుమార్, హిందూ ధార్మిక సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
వినతిలో ప్రధాన డిమాండ్లు:
🔸 రాష్ట్రంలోని ఆలయాలను సాంస్కృతిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి.

🔸 TTDతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సాంప్రదాయ కళాకారుల ఎంపికకు పారదర్శక విధానం అమలు చేయాలి.

🔸 భజన బృందాలు, కోలాటం, హరికథ, జానపద కళలు, కూచిపూడి, భరతనాట్యం తదితర సంప్రదాయ కళలకు ప్రోత్సాహం కల్పించాలి.

🔸 జిల్లా వారీగా కళాకారుల నమోదు, డిజిటల్ డేటాబేస్, సమాన అవకాశాలు మరియు పారదర్శక ఎంపిక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
సనాతన ధర్మం – భారతీయ సంస్కృతి – సంప్రదాయ కళల పరిరక్షణే మా లక్ష్యం.
మల్లెల శివ నాగేశ్వరరావు

జాతీయ అధ్యక్షుడు

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి